నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
ABN, First Publish Date - 2021-12-25T05:47:56+05:30
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం వారిలో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలుగులోకి తీసుకురావ డం కోసమే ఈ నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల ను నిర్వహిస్తున్నట్లు దాసరి పద్మ హనుమయ్య ఫౌండేషన్ కన్వీనర్ క్రీడల నిర్వాహకులు దాసరి పుష్ప, హనుమయ్య అన్నారు.
సుల్తానాబాద్, డిసెంబరు 24: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం వారిలో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలుగులోకి తీసుకురావ డం కోసమే ఈ నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల ను నిర్వహిస్తున్నట్లు దాసరి పద్మ హనుమయ్య ఫౌండేషన్ కన్వీనర్ క్రీడల నిర్వాహకులు దాసరి పుష్ప, హనుమయ్య అన్నారు. సుల్తానాబాద్ ప్రభు త్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న నియోజ కవర్గ స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఈ నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలంలో ని కాలేజీలో ఎక్కడా బ్యాట్మింటన్ కోర్టు కనబడలే దని, పెద్దపల్లి పట్టణంలోని ఓ గల్లీలో మాత్రం ఉం దని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతీ కళాశాల మైదా నంలో ఈ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నియోజకవర్గ స్థాయి బహుజన క్రీడాఉత్సవాలలో పాల్గొనేందుకు వంద టీములకు పైగా వచ్చాయ న్నారు. మూడు రోజుల పాటు ఈ క్రీడలు జరుగు తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్రావు, శేఖర్, పీడీ అంతటి శంకరయ్య, పీఈటీలు బాలసాని రాజ్కుమార్, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు గె ల్లు మధూకర్, సత్యం, సంపత్, అజ్జు, ఇక్బాల్, శివ, సంతోష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-25T05:47:56+05:30 IST