స్ర్కాప్ స్కామ్పై విచారణ జరపాలి
ABN, First Publish Date - 2021-10-07T06:22:49+05:30
రామగుండం కార్పొరేషన్లో పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని స్ర్కాప్ మాయంపై సమగ్ర విచారణ చేయాలని, ఈ స్కామ్లో ఉన్న ఎంతటివారినైనా వదలవద్దటంటూ సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ సత్యనారాయణకు పోస్టుకార్డులు పంపారు.
- మంత్రి కేటీఆర్, సీడీఎంఏకు పోస్టు కార్డులు
కళ్యాణ్నగర్, అక్టోబరు 6: రామగుండం కార్పొరేషన్లో పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని స్ర్కాప్ మాయంపై సమగ్ర విచారణ చేయాలని, ఈ స్కామ్లో ఉన్న ఎంతటివారినైనా వదలవద్దటంటూ సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ సత్యనారాయణకు పోస్టుకార్డులు పంపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ పాత మున్సిపల్ కార్యాలయంలో రూ.70లక్షల విలువగల స్ర్కాప్ రాత్రికి రాత్రే మాయం కావడం వల్ల ప్రభుత్వ ఆస్తిని, ప్రజా ధనాన్ని కొంత మం ది ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దో చుకుంటున్నారని ఆరోపించారు. స్ర్కాప్ మాయమై నెల రోజులైనా ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని, దీనివెనుక రాజకీయ ఒత్తి ళ్లు ఉన్నాయని, ముఖ్య ప్రజాప్రతినిధులే స్ర్కాప్ మాయంచేసి ప్రజా ధనాన్ని దోచుకున్నారని, స్ర్కాప్ స్కామ్పై విచారణ జరిపి నూతన మున్సిపల్ చట్టాన్ని అమలుచేసి, దీని వెనుక ఉన్న వారిని శిక్షించాల ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజర త్నం, రమేష్ కుమార్, శనిగరపు చంద్రశేఖర్, ఎండీ కరీం, రేణికుంట్ల ప్రీతమ్, శ్రీనివాస్, మల్లేష్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-07T06:22:49+05:30 IST