విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు{ గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్
ABN, First Publish Date - 2021-02-06T04:57:38+05:30
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కనబరిస్తేతగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ హచ్చరించారు.
ఏన్కూరు, ఫిబ్రవరి 5: విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కనబరిస్తేతగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ హచ్చరించారు. శుక్రవారం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రుతో కలిసి ఆయన ఏన్కూరు మండలం మూలపోచారంలోని గిరిన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. రిజిస్టర్లు పరిశీలించారు.
కరోనా అదుపులోకి వచ్చాక తిరిగి పాఠశాలలను ప్రారంభించారని, తప్పకుండా కోవిడ్నిబంధనలు పాటించి విద్యాబోధన చేయాలని తెలిపారు. పాఠశాల పరిసరాలను శానిటైజర్, బ్లీచింగ్చల్లాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏపీడీవో తిరుమలరావు, ఏసీఎ్ఫవో కృష్ణానాయక్, హెచ్ఎం,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-06T04:57:38+05:30 IST