రక్తదానం మహాదానం
ABN, First Publish Date - 2021-10-27T04:26:18+05:30
రక్తదానం మహాదానం అని డీఎస్పీ మోహన్రెడ్డి అన్నారు.
- డీఎస్పీ మోహన్ రెడ్డి
- జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
నాగర్కర్నూల్ క్రైం, అక్టోబరు26: రక్తదానం మహాదానం అని డీఎస్పీ మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు సముదా యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సంద ర్భంగా ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ ఆదేశాల మేర కు రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ మోహన్రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో వివిధ మండలాలకు చెందిన పోలీసు అధికారులు, వివిధ మండలాల నుంచి వచ్చిన యువకులు సుమారు 200మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్రెడ్డి మాట్లాడుతూ రక్తం దానం చేయడం వల్ల ప్ర మాదాలకు గురైన వారి ప్రాణాలకు కాపాడేందుకు దోహదం పడుతుందన్నారు. యువకులు అధిక సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. యువకులంతా రక్తదానం వల్లే కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగి ఉండాల న్నారు. కార్యక్రమంలో సీఐలు గాంధీనాయక్, వెంకట్రెడ్డి, ఎస్సైలు విజయ్కుమార్, మాదవరెడ్డి, వెంకటేష్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-27T04:26:18+05:30 IST