ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN, First Publish Date - 2021-09-02T05:30:00+05:30

మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో హైవే 44పై గురువారం రాత్రి కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), సెప్టెంబరు 2: మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో హైవే 44పై గురువారం రాత్రి కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.  మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్‌కు చెందిన గురుమూర్తి, శోభారాణి దంపతులు మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి వద్ద నివాసముంటున్నారు. శోభారాణి ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, కంపెనీ క్వార్టర్లలో ఉంటున్నారు. గురువారం రాత్రి గురుమూర్తి (50) రోడ్డు పక్కనున్న దుకాణం నుంచి ఇంటికి పాలు తీసుకెళ్తుండగా తూప్రాన్‌వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణంపాలయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తూప్రాన్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.  

Updated Date - 2021-09-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising