ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ: ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2022-01-01T04:23:29+05:30

బైక్‌ను ఆర్టీసీబస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), డిసెంబరు 31: బైక్‌ను ఆర్టీసీబస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మనోహరాబాద్‌ మండలంలోని కూచారం చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం ఉసిరికపల్లికి చెందిన శ్రీకాంత్‌, విజయ్‌ మేడ్చల్‌ వైపు నుంచి తూప్రాన్‌ వైపునకు బైక్‌పై హైవే 44 మీదుగా బయలుదేరారు. వారు మనోహరాబాద్‌ మండలంలోని కూచారం చౌరస్తా వద్దకు చేరుకోగానే నిజామాబాద్‌ డిపోకు చెందిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బస్సు బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.  ఈ ఘటనలో బైక్‌పై నుంచి కింద పడిన శ్రీకాంత్‌, విజయ్‌లకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయారు. క్షతగాత్రులిద్దరిని హైవే అంబులెన్సులో తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇరువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది.  

Updated Date - 2022-01-01T04:23:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising