మహిళా కానిస్టేబుల్ హత్య కేసు విచారణపై సజ్జనార్ ఆరా
ABN, First Publish Date - 2021-02-05T05:45:22+05:30
సంగారెడ్డి జిల్లా కోర్టులో కొనసాగుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ హత్య కేసును పరిశీలించేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ గురువారం సంగారెడ్డికి వచ్చారు.
సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 4 : సంగారెడ్డి జిల్లా కోర్టులో కొనసాగుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ హత్య కేసును పరిశీలించేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ గురువారం సంగారెడ్డికి వచ్చారు. సంగారెడ్డి జిల్లా కందికి చెందిన కానిస్టేబుల్ ప్రకాశ్ గతేడాదిన్నర క్రితం మహిళా కానిస్టేబుల్ మందాకిని హత్యచేసిన ఘటనకు సంబంధించి కేసు సంగారెడ్డి కోర్టులో ట్రయల్ కొనసాగుతున్నది. ఈ కేసు విచారణలో భాగంగా పరిశీలించేందుకు సీపీ సజ్జనార్ వచ్చారు. ఆయన వెంట ఎస్పీ ఎస్.చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు.
Updated Date - 2021-02-05T05:45:22+05:30 IST