ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్ భగీరధతో వంద శాతం ఆవాసాలకు నీటి సరఫరా: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-08-15T20:02:07+05:30

శంలో వంద ఆవాసాలకు మిషన్ భగీరధతో నీటి సరఫరా చేస్తున్నఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పంచాయితీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఅన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: దేశంలో వంద ఆవాసాలకు మిషన్ భగీరధతో నీటి సరఫరా చేస్తున్నఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పంచాయితీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఅన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లాలో మిషన్ భగీరథ కార్యక్రమం క్రింద 830 కోట్ల రూపాయల వ్యయంతో 610 అవాసాలకు శుద్ది చేసిన గోదావరి జలాలను అందిస్తున్నామని తెలిపారు.50 వేల లోపు రుణ మాఫీలో భాగంగా జనగామ జిల్లాలో 37 కోట్ల 94 లక్షల రూపాయలు, 11 వేల 957 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు.


జిల్లాలో 19 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 570 రైతు కల్లాల నిర్మాణాన్ని, 13 కోట్ల 64 లక్షల రూపాయల వ్యయంతో 62 రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామన్నారు.జనగామ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద 24 కోట్ల రూపాయల వ్యయంతో 483 అవాసాలలో పల్లె ప్రకృతి వనాలను, 35 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాల నిర్మాణాలను, 7 కోట్ల రూపాయల వ్యయంతో 281 డంపింగ్ యార్డుల నిర్మాణాని చేపట్టి పూర్తి చేశామని మంత్రి తెలిపారు.


జిల్లాలోని 12 మండల కేంద్రాలలో 4 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో త్వరలో బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం వివిధ రంగాలలో అత్యంత ప్రతిభ కనపరచిన అధికారులకు, ఉద్యోగులకు ఆయన ప్రశంస పత్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ శాసన సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-15T20:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising