డిగ్రీ కళాశాలను సందర్శించిన విద్యాశాఖ కమిషనర్
ABN, First Publish Date - 2021-08-21T05:49:29+05:30
డిగ్రీ కళాశాలను సందర్శించిన విద్యాశాఖ కమిషనర్
ఏటూరునాగారం, ఆగస్టు 20: ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్ను పరిశీలించారు. నూతనంగా నిర్మాణం అవుతున్న కళాశాల భవనం పనులనూ పరిశీలించారు. కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న బీహెచ్సీ, బీజీఎం, ఎంపీసీ కోర్సులను తెలుగు మీడియంలో అనుమతించాలని అధ్యాపకులు కోరారు. భర్తీ వెంటనే చేయాలని కోరగా అధ్యాపకుల వినతిని స్వీకరించారు. అనంతరం కళాశాల ఆవరణలో నవీన్ మిట్టల్ మొక్కలు నాటారు. కమిషనర్ వెంట రూసా స్టేట్ కోఆర్డినేటర్ సౌందర్య జోసెఫ్, అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ డీటీ చారి, అధ్యాపకులు ఎం.గన్సింగ్, రవీందర్, స్వామి, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-21T05:49:29+05:30 IST