Farmer commits suicide with financial difficulties
ABN, First Publish Date - 2021-05-18T05:50:26+05:30
ఆర్థిక ఇబ్బందులను తాళలేక సోమవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
బీర్కూర్, మే 17: ఆర్థిక ఇబ్బందులను తాళలేక సోమవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొనాపూర్ శంకర్ (32) చిన్న సన్నకారు రైతు. తనకున్న ఎకరం పొలంతోపాటు మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత కొన్నాళ్లు గా శంకర్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు, కూలీలకు శంకర్ శవాన్ని చూసి పోలీసుల కు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్సై రాజేశ్ సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు.
Updated Date - 2021-05-18T05:50:26+05:30 IST