Kamareddy: అదుపుతప్పి బోల్తాపడ్డ కారు...నలుగురికి గాయాలు
ABN, First Publish Date - 2021-08-20T17:46:26+05:30
జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది.
కామారెడ్డి: జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందర సీట్లో తల్లి ఒడిలో ఉన్న చిన్నారి నిద్ర మత్తులో స్టీరింగ్కు కాలు తలగడంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది.
Updated Date - 2021-08-20T17:46:26+05:30 IST