పింఛన్దారులు ఆందోళన చెందొద్దు
ABN, First Publish Date - 2021-01-14T04:24:30+05:30
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం తమ పింఛన్లను తొల గించారని బాధితులు ఎమ్మెల్యేకు విన్నవిం చారు.
ఎల్లారెడ్డి, జనవరి 13: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం తమ పింఛన్లను తొల గించారని బాధితులు ఎమ్మెల్యేకు విన్నవిం చారు. పింఛన్దారులు ఆందోళన చెందవ ద్దని, తొలగించిన వారిపై విచారణ చేయిం చి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సు రేందర్ అన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించేలా చూస్తానని హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కమిషనర్ ఖమర్హైమ ద్, జడ్పీటీసీ ఉషాగౌడ్, ఎంపీటీసీ సంతో ష్, సింగిల్విండో చైర్మన్ నర్సింలు తదిత రులు పాల్గొన్నారు. పింఛన్ల తప్పిదంలో తమ ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని టీఎస్జీవోస్ అధ్యక్షుడు మహిపాల్ తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ ఉద్యోగులు ముఖిద్, అరుణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట: మండలంలోని నల్లమడు గు గ్రామంలో బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే జాజాల సురేందర్ లబ్ధిదారులకు సీ ఎం సహయనిధి చెక్కులను పంపిణీ చేశా రు. నల్లమడుగు గ్రామానికి చెందిన రూ.35వేలు, పోల్కంపేటకు చెందిన సుధా కర్కు రూ.10వేల చెక్కులను ఎమ్మెల్యే అం దజేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మ న్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-01-14T04:24:30+05:30 IST