ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగిరెడ్డిపేట రామాలయంలో చోరీ

ABN, First Publish Date - 2021-11-02T05:40:01+05:30

మండల కేంద్రంలోని రామాలయం లో ఆదివారం రాత్రి గుర్తు తెలియ ని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగులగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగిరెడ్డి పేట, నవంబరు 1: మండల కేంద్రంలోని రామాలయం లో ఆదివారం రాత్రి గుర్తు తెలియ ని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగులగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న రామాలయంలో గేటు తెరుచుకుని లోనికి ప్రవేశించా రు. ఆలయం లోపల ఉన్న హుండీ ని పగుల గొట్టి డబ్బుల్ని హుండీలో ఉన్న వస్తువులను దొంగిలించి పరారయ్యారు. ఆలయ నిర్వాహకు లు ఉదయం చూసేసరికి హుండీని పగుల గొట్టి డబ్బులు ఎత్తుకు పోయిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చోరీ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-02T05:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising