ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల
ABN, First Publish Date - 2021-11-09T07:44:01+05:30
శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది.
హైదరాబాద్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 16 కాగా.. ఉపసంహరణలకు 22 వరకూ సమయమిచ్చారు. 29న పోలింగ్ ఉంటుంది. అయితే 6 స్థానాల్లోనూ టీఆర్ఎస్ నిర్ణయించిన అభ్యర్థులే ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
Updated Date - 2021-11-09T07:44:01+05:30 IST