రైతుబంధుకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలి
ABN, First Publish Date - 2021-05-31T04:30:13+05:30
రైతుబంధుకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలి
బషీరాబాద్: ఇటీవల కొన్ని బ్యాంకుల విలీనంతో సంబంధిత రైతులు కొత్తగా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని బషీరాబాద్ వ్యవసాయాధికారి నాగంకృష్ణ తెలిపారు. ఆంధ్రాబ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో విలీనం కాగా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్కు విలీనం కాగా, సిండికేట్ బ్యాంక్, కెనరాబ్యాంకుకు విలీనం అయిందన్నారు. అలాగే దీనాబ్యాంక్, విజయ్బ్యాంక్, బ్యాంక్ ఆఫ్బరోడాగా విలీనం అయిందన్నారు. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులు బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ నంబర్లు మారనున్నందున రైతులు పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్, దరఖాస్తు ఫామ్లతో ఏఈవోలకు ఇవ్వాలన్నారు. విలీనం కాని బ్యాంకుల రైతులు ఎవరూ దరఖాస్తులు చేసుకోవద్దన్నారు. అలాగే గతేడాది రైతుబంధు రాని రైతులు, క్రాప్లోన్ అకౌంట్ ఇచ్చి ఉంటే తమ సేవింగ్ ఖాతా వివరాలను ఇచ్చి మార్చుకోవాలని సూచించారు.
Updated Date - 2021-05-31T04:30:13+05:30 IST