బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... దంపతుల దుర్మరణం
ABN, First Publish Date - 2021-08-10T21:38:54+05:30
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... దంపతుల దుర్మరణం
మహబూబ్నగర్: జిల్లాలోని దేవరకద్ర శివారులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న దంపతుల దుర్మరణం చెందారు. మృతులు లక్ష్మీకాంత్రెడ్డి (65), నారాయణమ్మ (50)గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-08-10T21:38:54+05:30 IST