ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు, ఆటో ఢీ.. ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2021-02-05T07:28:28+05:30

వేగంగా దూసుకొచ్చిన కారు (తుఫాన్‌ వాహనం) ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో గురువారం జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగదేవ్‌పూర్‌, ఫిబ్రవరి 4: వేగంగా దూసుకొచ్చిన కారు (తుఫాన్‌ వాహనం) ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో గురువారం జరిగింది. చాట్లపల్లికి చెందిన బి.శ్రీశైలం(40), గడ్డం కనకయ్య (42), బరిగే రమేష్‌ (41) ఆటోలో జగదేవపూర్‌కు బయలు దేరగా, గొల్లపల్లికి రాగానే అదే గ్రామానికి చెందిన సుజాత, కనకమ్మ ఇదే ఆటోలో ఎక్కారు. ఈ సమయంలో ఎదురుగా వేగంతో దూసుకొచ్చిన కారు.. ఆటోను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన  రమేష్‌, శ్రీశైలం, కనకయ్య అక్కడక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన సుజాత, కనకమ్మలను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-02-05T07:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising