విప్లవనేత రవూఫ్కు ఘన నివాళి
ABN, First Publish Date - 2022-02-10T05:57:56+05:30
º విప్లవనేత ఎస్ఏ రవూఫ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

కదిరి ఫీచర్స్, ఫిబ్రవరి 9: విప్లవనేత ఎస్ఏ రవూఫ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కదిరి మున్సిపాల్టీ పరిధిలోని కుటాగుళ్ళలో ఆయన స్థూపం వద్ద విగ్రహానికి బుధవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తొలుత స్థానికుడు, రవూఫ్ సమకాలికుడు పెద్దన్న చేత పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. ఆయనపై విప్లవ గీతాలను ఆలపించారు. రవూఫ్ ఆశయాలు, నిబద్ధత అందరికీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంద్ర, స్థానిక కుటుంబ సభ్యులు అలీఖాన, స్థానికులు ఎం రామన్న, గంగన్న, ప్రసాద్, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-02-10T05:57:56+05:30 IST