ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలిపడుతుండగా ఆటో టైరు పేలి ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-10-18T06:11:48+05:30

గాలి పడుతుండగా ఆటో టైరు పేలడంతో మురళి (55) మృతి చెందారు. ఈ ఘటన సోమవారం విజయపురం మండలంలోని పన్నూరు సబ్‌స్టేషన్‌ వద్ద జరిగింది.

మురళి (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురం, అక్టోబరు 17: గాలి పడుతుండగా ఆటో టైరు పేలడంతో మురళి (55) మృతి చెందారు. ఈ ఘటన సోమవారం విజయపురం మండలంలోని పన్నూరు సబ్‌స్టేషన్‌ వద్ద జరిగింది. ఎల్లసముద్రం గ్రామానికి చెందిన మురళి బతుకు తెరువుకోసం పన్నూరు సబ్‌స్టేషన్‌లో 30 ఏళ్లుగా పంక్చరు షాపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆటోకు గాలి పడుతుండగా టైరు పేలింది. టైరు చుట్టూ ఉన్న ఇనుపకమ్మీ మురళి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనుచరుల ద్వారా మంత్రి రోజా మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ అధ్యక్షురాలు శాంతి, ఆర్బీకే చైర్మన్‌ గుణశేఖర్‌రెడ్డి, సర్పంచులు కుమార్‌, శ్రీరాములురెడ్డి, వైసీపీ నాయకులు సతీ్‌షయాదవ్‌, అంగముత్తు, నాగరాజు, హరీష్‌ తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. 


Updated Date - 2022-10-18T06:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising