విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-09-14T06:08:04+05:30
ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు డిమాండ్ చేశారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం
అజిత్సింగ్నగర్, సెప్టెంబరు 13 : ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈనెల 16న తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్షకు సంబంధించిన వాల్పోస్టర్లను సింగ్నగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను విస్తృతంగా విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలన్నారు. విద్యా ఆగ్రహ దీక్షలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గరిమెళ్ల చిన్నా, మురళీకృష్ణం రాజు, జైపాల్, బాషా, పాల్గన్నారు.
Updated Date - 2022-09-14T06:08:04+05:30 IST