ఈ రోడ్లకు మోక్షమెప్పుడు?
ABN, First Publish Date - 2022-09-13T03:43:46+05:30
పట్టణంలోని ముసునూరు ఇందిరమ్మ, దివ్యాంగుల కాలనీలలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చినుకు పడితే ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి.
ముసునూరు ఇందిరమ్మ, దివ్యాంగుల కాలనీల వాసుల ఆందోళన
కావలి, సెప్టెంబరు 12: పట్టణంలోని ముసునూరు ఇందిరమ్మ, దివ్యాంగుల కాలనీలలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చినుకు పడితే ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. దీంతో ఆ కాలనీల వాసులు ఆందోళన చెందుతున్నారు. సంవత్సరాలు తరబడి అధికారులు చుట్టూ తిరిగినా, డయల్ యువర్ ఎమ్మెల్యేకు పలు పర్యాయాలు ఫోన్ ద్వారా చెప్పినా, నేరుగా ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకున్నా ఆ కాలనీల రోడ్లకు మోక్షం కలుగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా దివ్యాంగుల కాలనీలో ఉన్న దివ్యాంగులు వర్షాకాలంలో బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లు వేయకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టేందుకు దివ్యాంగులు సమాయత్తం అవుతున్నట్లు ఆ కాలనీ ప్రెసిడెంట్, దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు పేర్కొన్నారు.
Updated Date - 2022-09-13T03:43:46+05:30 IST