ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sravan Kumar: కందుకూరు ఘటన దురదృష్టకరం

ABN, First Publish Date - 2022-12-29T16:41:52+05:30

కందుకూరు (Kandukur) తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబాలను జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ (Jada Sravan Kumar) పరామర్శించునున్నారు. ఆయన

కందుకూరు ఘటన దురదృష్టకరం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: కందుకూరు (Kandukur) తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబాలను జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ (Jada Sravan Kumar) పరామర్శించునున్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగటం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు జై భీమ్ భారత్ పార్టీ(Jai Bheem Bharat Party) అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చనిపోయిన బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే తెలుగుదేశం(tdp) ప్రభుత్వం ఈ హామీని నిర్వర్తించాలని కోరారు. రాజకీయ పార్టీలు బహిరంగ సభలో నిర్వహించేటప్పుడు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవటానికి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకతీతంగా కదిలిరావాలని పిలుపునిచ్చారు. చనిపోయిన దళిత బహుజన బలహీన వర్గాల ప్రజలకు పూర్తిగా అండగా ఉంటామని శ్రావణ్ కుమార్ ప్రకటించారు.

Updated Date - 2022-12-29T16:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising