Congress Plans:రాజస్థాన్కు హిమాచల్ ఎమ్మెల్యేల తరలింపు...ఆపరేషన్ లోటస్ పేరిట కాంగ్రెస్ వ్యూహం
ABN, First Publish Date - 2022-12-08T08:36:43+05:30
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ‘హస్త’గతం కోసం ఆపరేషన్ లోటస్ కు తెర తీసింది....
న్యూఢిల్లీ:హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ‘హస్త’గతం కోసం ఆపరేషన్ లోటస్ కు తెర తీసింది.(Operation Lotus)గురువారం సాగుతున్న ఎన్నికల్లో విజయం సాధించే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను(Himachal MLAs) బీజేపీ ఆకర్ష్ ప్రయత్నాల నుంచి అడ్డుకునేందుకు వారిని రాజస్థాన్(Rajasthan) రాష్ట్రానికి తరలించాలని నిర్ణయించారు.(Congress Plans) ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ,సీనియర్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడాకు ఎమ్మెల్యేలను ‘ఆపరేషన్ లోటస్’ వ్యూహంలో భాగంగా ముందస్తుగా రాజస్థాన్ రాష్ట్రానికి తరలించే బాధ్యతను అప్పగించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.(Shift)
ఎమ్మెల్యేలను బస్సుల్లో రాజస్థాన్కు తరలించే అవకాశం ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, గురువారం ఆమె కూడా సిమ్లా చేరుకుంటారని సమాచారం.ధరల పెరుగుదల, నిరుద్యోగం, పాత పెన్షన్ స్కీమ్ సవాళ్లపై ఓటర్లు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ తన విజయంపై విశ్వాసం వ్యక్తం చేసింది.2023లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ ఆశలు హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రారంభించాలని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - 2022-12-08T08:41:43+05:30 IST