Mettur Dam: ఏడాదిలో రెండోసారి నిండిన మేట్టూరు
ABN, First Publish Date - 2022-10-13T16:05:32+05:30
సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం(Mettur Dam) ఈ ఏడాది రెండోసారి పూర్తిస్థాయిలో నిండింది. కావేరి పరీవాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో
పెరంబూర్(చెన్నై), అక్టోబరు 12: సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం(Mettur Dam) ఈ ఏడాది రెండోసారి పూర్తిస్థాయిలో నిండింది. కావేరి పరీవాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలోకి 33,420 ఘనపుటడుగుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో, మంగళవారం సాయంత్రం 119 అడుగులున్న నీటి మట్టం బుధవారం ఉదయం పూర్తిస్థాయి (120 అడుగులు)కి చేరింది. 25 రోజుల అనంతరం డ్యాం నుంచి అదనపు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 120 అడుగులు (93.47 టీఎంసీలు)గా ఉన్నట్లు, డ్యాంలోకి 28 వేల ఘనపుటడుగుల నీరు వస్తుండగా, 23 వేల ఘనపుటడుగుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.
Updated Date - 2022-10-13T16:05:32+05:30 IST