ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamilnadu: హిందీని బలవంతంగా రుద్దే కేంద్రం చర్యకు నిరసనగా వృద్ధుడి ఆత్మాహుతి

ABN, First Publish Date - 2022-11-26T19:55:58+05:30

తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దే కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ 85 ఏళ్ల వృద్ధుడు శనివారంనాడు ఆత్మాహుతి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సేలం: తమిళనాడులో (Tamilnadu) హిందీని బలవంతంగా రుద్దే (Imposition of Hindi) కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ 85 ఏళ్ల వృద్ధుడు శనివారంనాడు ఆత్మాహుతి చేసుకున్నాడు. సేలం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని మెట్టూరు సమీపంలోని తలైవూర్‌ గ్రామానికి చెందిన తంగవేల్‌గా గుర్తించారు. డీఎంకే వ్యవసాయ విభాగం యూనియన్ ఆర్గనైజర్‌గా సేవలందించిన తంగవేల్ కొద్ది సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు.

తలైవూరులోని పార్టీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటల ప్రాంతానికి తంగవేల్ వచ్చారు. పార్టీ కార్యాలయం ముందు ఆయన ఒక లేఖను ఉంచినట్టు మెట్టూరు పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. తమిళం మాట్లాడే రాష్ట్రంలో హిందీని బలవంతంగా మోదీ ప్రభుత్వం రుద్ద కూడదని, ఆ విధంగా చేస్తే ఇక్కడి విద్యార్థులు నష్టపోతారని ఆ లేఖలో తంగవేల్ పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. తంగవేల్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారని, దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే తమిళనాడు కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సీవీ గణేషన్, పలువురు డీఎంకే నేతలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తంగవేల్ కుటుంబ సభ్యులకు స్వాంతన పలికారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-11-26T19:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising