ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

With love to mom: అమ్మకు ప్రేమతో..ఇంట్లో తల్లి విగ్రహం ప్రతిష్ట

ABN, First Publish Date - 2022-11-21T11:15:39+05:30

మాతృమూర్తిపై తన ప్రేమను చాటుకున్నాడో వ్యక్తి. నవమాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ముషీరాబాద్‌: మాతృమూర్తిపై తన ప్రేమను చాటుకున్నాడో వ్యక్తి. నవమాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచి పెద్దవాడిని చేసిన ఆ తల్లి రుణం తీర్చుకునే విధంగా, రోజూ నిద్రలేవగానే అమ్మను స్మరించుకునేలా ఇంట్లోనే తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ముషీరాబాద్‌ బాపూజీనగర్‌కు చెందిన టెంట్‌హౌస్‌ యజమాని బాదం శ్రీనివాస్‌.

శ్రీనివాస్‌ తల్లి బాదం వెంకటసూర్యకుమారికి నలుగురు సంతానం. శ్రీనివాస్‌ రెండో కుమారుడు. ఆమె ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఏడో వర్ధంతిని పురస్కరించుకుని శ్రీనివాస్‌ తన తల్లి విగ్రహాన్ని ఏపీలో తయారు చేయించి ఆదివారం తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇంట్లోని ప్రత్యేక గదిలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడమేకాక ఆ గదిలో చుట్టూ మాతృమూర్తి ఫొటోలను ఏర్పాటు చేసి అమ్మపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అయితే, తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలియడంతో చుట్టుపక్కల వారితోపాటు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం శ్రీనివాస్‌ నివాసానికి వచ్చారు. ఆయన తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాతృమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు అతడిని అభినందించారు.

Updated Date - 2022-11-21T11:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising