ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంబురాలతో పశుపోషణపై ఆసక్తి

ABN, First Publish Date - 2022-10-28T23:15:47+05:30

రైతు సంబురాలతో రైతు లకు పశుపోషణపై ఆసక్తి పెరుగుతుందని గట్టు జడ్పీటీసీ సభ్యురాలు బాసు శ్యామల, ఎంపీపీ విజయ్‌కుమార్‌ అన్నారు.

పోటీలను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ సభ్యురాలు బాసు శ్యామల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీటీసీ సభ్యురాలు బాసు శ్యామల, ఎంపీపీ విజయ్‌కుమార్‌

- పశువుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభం

కేటీదొడ్డి, అక్టోబర్‌ 28 : రైతు సంబురాలతో రైతు లకు పశుపోషణపై ఆసక్తి పెరుగుతుందని గట్టు జడ్పీటీసీ సభ్యురాలు బాసు శ్యామల, ఎంపీపీ విజయ్‌కుమార్‌ అన్నారు. వెంకటాపురంలోని పాగుంట వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగం గా రైతు సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం నిర్వహించిన న్యూకేటగిరి విభాగం పశువుల బల ప్రదర్శన పోటీలను వారు ప్రారంభించి, మాట్లాడారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆదేశం మేరకు ప్రతీ ఏటా రైతు సంబురాలు నిర్వహించడం, అందులో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషదా యక మన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అంతకు ముందు వారు వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్ర మంలో కేటీ దొడ్డి జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉరుకుందు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు హనుమంతు, నాయకులు గోపి, యుగంధర్‌గౌడ్‌, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-28T23:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising