First Manifesto of TDP : సంక్షేమ శరాలతో సమరశంఖం
ABN, First Publish Date - 2023-05-29T04:34:13+05:30
గోదారి తీరంలో... ‘సమర శంఖం’ మోగింది. ‘రాబోయేది కురుక్షేత్రం... కౌరవులను ఓడించి గౌరవ సభలో అడుగు పెడతా’ అని నినదించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు..
భారీ వరాలతో టీడీపీ మొదటి మేనిఫెస్టో
ఆడబిడ్డ నిధి పేరిట 18–59 ఏళ్ల మహిళలకు నెలకు 1500..
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ తల్లికి వందనం
కింద ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఏడాదికి 15 వేలు
మహిళలందరికీ జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం..
ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం
రైతులకు ఏడాదికి రూ.20 వేలు..
బీసీలకు రక్షణ చట్టం..
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు
దసరాకు పూర్తిస్థాయి ప్రణాళిక..
ప్రతి హామీనీ అమలు చేసే శక్తి నాకుంది..
ఆదాయం పెరిగితే అమలు ఈజీ ఎలా పెంచాలో నాకు తెలుసు..
జగన్ అసమర్థత వల్లే పెరగలేదు.. మహానాడులో చంద్రబాబు
గోదారి తీరంలో... ‘సమర శంఖం’ మోగింది. ‘రాబోయేది కురుక్షేత్రం... కౌరవులను ఓడించి గౌరవ సభలో అడుగు పెడతా’ అని నినదించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ‘సంక్షేమ శరాలు’ సంధించి రణ భేరీ మోగించారు. ‘ఎన్నికల ప్రణాళికను పాక్షికంగా ప్రకటిస్తాం. ప్రజలకు ఏం చేస్తామో రాజమహేంద్రి వేదికగా వెల్లడిస్తాం’ అని ప్రకటించినట్లుగానే.. ఆదివారం సాయంత్రం జరిగిన సభలో భారీ జనసందోహం సాక్షిగా చంద్రబాబు కీలకమైన ఎన్నికల హామీలను ప్రకటించారు. పేదలను ధనికులుగా మార్చడమే లక్ష్యమన్నారు. మహిళలు, యువత, రైతుల కోసం మహాశక్తి, యువగళం, అన్నదాత పేర్లతో ప్రత్యేకమైన హామీలు గుప్పించారు. సమరోత్సాహంతో అడుగులు వేస్తున్న తెలుగు తమ్ముళ్లలో ఈ హామీలు మరింత ఉత్సాహాన్ని నింపాయి. చంద్రబాబు ఒక్కో ప్రకటన చేస్తుండగా.. సభకు హాజరైన జనం నుంచి భారీ స్పందన కనిపించింది.
మహానాడులో నినాదాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు
Updated Date - 2023-05-29T04:34:13+05:30 IST