కబ్జాదారులను అరెస్టు చేయాలి

ABN, First Publish Date - 2023-01-24T00:48:51+05:30

సోమందేపల్లి మండలంలో ఎస్టీల భూములను కబ్జాచేసిన ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు.

కబ్జాదారులను అరెస్టు చేయాలి
నిరసనకారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి

కలెక్టరేట్‌ వద్ద నిరసన

పుట్టపర్తి రూరల్‌, జనవరి 23: సోమందేపల్లి మండలంలో ఎస్టీల భూములను కబ్జాచేసిన ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. సోమందేపల్లి మండలంలోని పాలసముద్రం సర్వే నెంబరు 99లో 7 ఎకరాల ప్రభుత్వ భూమి ఎస్టీలకు చెందినదనీ, ఈ భూమిని కబ్జాచేసి దౌర్జన్యంగా నిర్మాణాలు చేపడుతున్న ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందరెడ్డి, వైసీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరు బసంతకుమార్‌.. వారి వద్దకు వచ్చి, మాట్లాడారు. విచారణ చేసి, న్యాయం చేస్తామనీ, అవసరమైతే వివాదాస్పద భూమి వద్ద 144 సెక్షన అమలుకు తహసీల్దార్‌కు అదేశాలిస్తామని తెలిపారు. దీంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌ వెంకటేశులు, నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T00:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising