ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థులతో వైసీపీ ర్యాలీ

ABN, First Publish Date - 2023-11-29T00:24:42+05:30

వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు పడని తంటాలు లేవనే చెప్పాలి. ఉచితానుచితాలు మరచిపోవడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సప్తగిరి సర్కిల్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

డీజేలతో చిందులు

గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం

ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌ 28: వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు పడని తంటాలు లేవనే చెప్పాలి. ఉచితానుచితాలు మరచిపోవడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో మంగళవారం ‘మళ్లీ జగనన్నే సీఎం కావాలి’ అనే నినాదంతో ర్యాలీని నిర్వహించారు. టవర్‌క్లాక్‌ నుంచి చేపట్టిన ఈ ర్యాలీలో కాలేజీ విద్యార్థులను భాగస్వాముల్ని చేశారు. డీజేలు, చిందులతో ప్రధాన సర్కిళ్లల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. దారినపోతున్న వారందరికి ఆ డీజే సౌండ్‌, అల్లర్లు, చిందులు విసుగుపుట్టించాయనే చెప్పాలి. గంటకుపైగా సాగిన ఈ ర్యాలీ కారణంగా టవర్‌క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకూ ట్రాఫిక్‌ మొత్తం జామ్‌ అయింది. దీంతో పోలీసులు వారిని ఏమీ అనలేక, ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయలేక నానా ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2023-11-29T00:24:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising