ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu TDP : రాజధానిపై జగన్‌ మాటలు వింటే ఊసరవెల్లికీ సిగ్గేస్తుంది

ABN, First Publish Date - 2023-02-16T03:06:58+05:30

‘తొందరగా ఎన్నికలు పెడితే తానే నెగ్గేస్తానని సైకో భావిస్తున్నాడు. పెట్టినా పెట్టేస్తాడు. నేను రెడీ.. 5 కోట్ల మంది ప్రజలూ రెడీ’ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. రాజధానిపై జగన్‌ మాటలు వింటే ఊసరవెల్లికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యానుకు మళ్లీ ఓటేస్తే ఉరివేసుకున్నట్లే: చంద్రబాబు

జగన్‌ పనైపోయింది

ఒక్క చాన్సుతో సర్వనాశనం చేసేశాడు

రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు

జనంపై కనికరం లేని వ్యక్తి

అలాంటి సైకోను జూలో పెట్టాలి

తాడోపేడోకు ప్రజలంతా సిద్ధంకావాలి

గోకవరం, జగ్గంపేటల్లో బాబు ఫైర్‌

ఉమ్మడి తూర్పు పర్యటనకు శ్రీకారం

(కాకినాడ/రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

‘తొందరగా ఎన్నికలు పెడితే తానే నెగ్గేస్తానని సైకో భావిస్తున్నాడు. పెట్టినా పెట్టేస్తాడు. నేను రెడీ.. 5 కోట్ల మంది ప్రజలూ రెడీ’ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. రాజధానిపై జగన్‌ మాటలు వింటే ఊసరవెల్లికి కూడా సిగ్గేస్తుందన్నారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ పని అయిపోయిందన్నారు. ఒక్క చాన్స్‌ అంటూ విచ్చలవిడి అవినీతితో సర్వనాశనం చేశాడని, రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని అన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడ్రోజుల పర్యటన ప్రారంభించారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి గోకవరం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. గోకవరంలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జగ్గంపేట వెళ్లి బహిరంగ సభలో మాట్లాడారు. సైకో జగన్‌ నాలుగేళ్లలో అభివృద్ధే చేయలేదన్నారు. కడపలో ఒక ఫ్యాక్టరీకి నాలుగు సార్లు ఫౌండేషన్‌ వేశాడు.. అదే ఘనకార్యమని ఎద్దేవాచేశారు. సైకోను ఇంటికి పంపకపోతే అందరం ఫ్యానుకు ఉరివేసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సైకోను ఇంటికి పంపించాలని పిలుపిచ్చారు. ‘అధికారం కోసం సొంతబాబాయినే చంపేసిన దుర్మార్గుడు నన్ను వదిలిపెడతాడా..? ఓటు అనే ఆయుధంతో జనం ఫ్యాన్‌ను చితక్కొట్టాలి. వైసీపీకి ఈసారి ఓటు వేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లే’ అని అన్నారు. జనంపై కనికరం లేకుండా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిని జూలో పెట్టాలని.. ఈ సైకో ప్రభుత్వాన్ని తిట్టడానికి సైకో పదం సరిపోవడం లేదని.. అంతకుమించిన కొత్త పదం కనిపెట్టాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు ఇంటింటికీ వచ్చి స్టిక్కర్లు వేస్తానంటే చూస్తూ ఊరుకోవద్దన్నారు. సైకో వైసీపీతో తాడోపేడో తేల్చుకుందామని.. ప్రజలంతా సిద్ధం కావాలని చెప్పారు. ‘అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు. ఆ రెండింటినీ జగన్‌ పొడిచేశాడు. పోలవరాన్ని గోదారిలో కలిపి అమరావతిని నట్టేట ముంచాడు’ అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే...

రాజధానిపై ఇన్ని మాటలా...

ప్రతిపక్ష నేత హోదాలో ఆనాడు జగన్‌ రాజధాని అమరావతికి పూర్తి మద్దతు ఉంటుందన్నాడు. అమరావతి కట్టండి.. నేను కూడా ఇల్లు అక్కడే కట్టుకుంటానని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చేశాడు. ముందు మూడు రాజధానులు అన్నారు. కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని, విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు మాట మార్చి విశాఖే రాజధాని అంటున్నారు. ఇన్ని మాటలు మార్చుతున్న వైసీపీని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు. బుద్ధి ఉన్నవాళ్లు మళ్లీ జగన్‌ను ఎన్నుకుంటారా..? ఇటువంటి దుర్మార్గుడికి ఓటేస్తారా..? జీవో నంబర్‌ వన్‌ తెచ్చి ఏదో చేద్దామనుకున్నాడు. చివరకు పోలీసులను కూడా మోసం చేశాడు. టీఏ, డీఏ, సరెండర్‌ లీవ్‌ ఏదీ ఇవ్వడం లేదు. అందరి మెడపై కత్తిపెట్టి నా మాట వినాలని అంటున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఓటుకు పదివేలు ఇస్తాడట.

ఆ దరిద్రం ముఖం చూడాలా..?

కొత్తగా జగన్‌ ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తారంట. మా నమ్మకం.. నువ్వే జగన్‌ అంటూ వెళ్తారంట. పెట్టించుకుంటారా స్టిక్కర్లు..? చేసిందంతా చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి ఏముఖం పెట్టుకుని స్టిక్కర్లు వేస్తారు..? గృహసారథుల పేరిట ఇంటింటికీ వస్తారట. అందరిచేత ప్రమాణం చేయించి ఓటు వేయమని ఒట్టు వేయించుకుంటారు. మనం ఓటు వేస్తే శాశ్వతంగా ఉరితాడు బిగించుకున్నట్లే! తాత, ముత్తాతలనుంచి వచ్చిన భూమిపై జగన్‌ ఫోటో వేస్తున్నారు. జనం ఆస్తిపై ఆయన ఫొటో ఏంటి? పొద్దున లేచి ప్రజలు తమ ఇంట్లో పాస్‌పుస్తకంపై ఉన్న దరిద్రం ముఖం చూడాలా..? బాబాయి వివేకానందరెడ్డిని ఎవరు చంపారు..? నేనే చంపానని నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమైంది.. ఎవరు చేశారో అందరికీ తెలిసింది కదా! సొంత బాబాయిని చంపిన వ్యక్తి నన్ను వదిలిపెడతాడా. రాష్ట్రంలో ఎవరికైనా ఆస్తి ఉంటే రాసివ్వకపోతే చంపేస్తున్నారు. విశాఖలో అన్ని ఆస్తులు అలాగే ఈ సైకోలకు రాసిచ్చేశారు. నేను బాధితులను పిలిచి అడిగితే.. ఆస్తి రాసివ్వకపోతే చంపేస్తామంటున్నారు.. అందుకే రాసిచ్చేశామని బాధగా చెబుతున్నారు. కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను అలాగే రాయించేసుకున్నారు.

చంద్రబాబు వస్తున్నారని..!

చంద్రబాబు గురువారం జగ్గంపేట మీదుగా పెద్దాపురానికి రోడ్‌ షో నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద రహదారుల మరమ్మతు పనులు చేపట్టారు. రహదారి వెంబడి ఉన్న గుంతలను పూడ్చి, రోడ్డుపై దుమ్ము లేకుండా ట్యాంకర్లతో తడిపే పనులు చేస్తున్నారు. చంద్రబాబు రాకతో అయినా రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దాపురం

పిచ్చోడి వద్ద రాయి ఉంటే ఏం చేస్తాడు.. మిమ్మల్ని కొడతాడు.. అందరినీ కొడతాడు.. చివరకు ఆ రాయితో తనను తానే కొట్టుకుంటాడు.

జగన్‌ పనైపోయింది. గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుంది.. ప్రజలు రోడ్డు పైకి రావాలి. పేదవాడికి న్యాయం జరగాలి. మోసకారి సంక్షేమ పథకాలకు స్వస్తి పలకాలి.

- చంద్రబాబు

Updated Date - 2023-02-16T09:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising