ఆడుదాం ఆంధ్రా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
ABN, Publish Date - Dec 29 , 2023 | 12:18 AM
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాల పర్యవేక్షణకు 24 గంటల పాటు పనిచేసే కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేశామని జేసీ శ్రీనివాసులు అన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 28: ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాల పర్యవేక్షణకు 24 గంటల పాటు పనిచేసే కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేశామని జేసీ శ్రీనివాసులు అన్నారు. గురువారం జ్యోతిరావుపూలే భవనంలో ఆయన సెంటర్ను ప్రారంభించారు. మండలస్థాయిలో షెడ్యూల్ మేర పోటీలు నిర్వహిస్తున్నారో లేదో గుర్తించాలని, పోటీలు ప్రారంభమైన వెంటనే ఫొటోలను అప్లోడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోటీల అనంతరం ఫలితాలను కూడా కంట్రోల్ సెంటర్ సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో డీఎల్డీవో రవికుమార్, వయోజన విద్య అధికారి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2023 | 12:18 AM