రేణిగుంటలో జేటీసీ కార్యాలయం ప్రారంభం
ABN, First Publish Date - 2023-05-11T23:59:20+05:30
రేణిగుంటలో గురువారం రాయలసీమ జోన్ సంయుక్త రవాణా కమిషనర్ కార్యాలయాన్ని జాయింట్ కమిషనర్ ఎం.బసిరెడ్డి పూజలు చేసి ప్రారంభించారు.
రేణిగుంట మే11: రేణిగుంటలో గురువారం రాయలసీమ జోన్ సంయుక్త రవాణా కమిషనర్ కార్యాలయాన్ని జాయింట్ కమిషనర్ ఎం.బసిరెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తిరుపతికి ఈ కార్యాలయం రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యాల యం ఏర్పడటం వల్ల ఉద్యోగులు, వాహన చోదకుల సమస్యలు తక్షణం పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీటీవో సీతారామిరెడ్డి, డీవీటీసీ నిరంజన్రెడ్డి, ఎంవీఐలు చంద్రశేఖర్, నరసింహులు, దామోదర్నాయుడు, ఎఎంవీఐలు శ్రీహరి, హేమేంద్ర కుమార్, శ్వేతబిందు, విశ్రాంత డీటీవో విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-05-11T23:59:20+05:30 IST