ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యం

ABN, First Publish Date - 2023-11-29T00:39:25+05:30

యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే ‘ఆడుదాం ఆంధ్రా’ లక్ష్యమని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 28: యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే ‘ఆడుదాం ఆంధ్రా’ లక్ష్యమని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబరు 15 నుంచి దాదాపు 51 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మొత్తం పది వేల పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయిలో గెలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీవోలు, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని వివరించారు. డీఈవో విజయేంద్రరావు సమన్వయంతో క్రీడాకారులకు పీఈటీ, పీడీలు శిక్షణ ఇస్తారన్నారు. మైదానాల్లో మెడికల్‌ టీం అందుబాటులో ఉంటుందన్నారు. డిసెంబరు 10వ తేదీలోపు ఒక్కొక్కరు గరిష్ఠంగా రెండు క్రీడల్లో గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఈవో విజయేంద్రరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising