ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లారి’ని బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందో?: ఎమ్మెల్సీ డొక్కా

ABN, First Publish Date - 2023-03-14T03:28:01+05:30

మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారని విన్నా. నిజానికి ఆయన బీజేపీలో చేరడం ద్వారా ఒక ఓటు మాత్రమే వస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారని విన్నా. నిజానికి ఆయన బీజేపీలో చేరడం ద్వారా ఒక ఓటు మాత్రమే వస్తుంది. అది కిరణ్‌కుమార్‌రెడ్డిదే. ఆయన కుటుంబ సభ్యులు కూడా బీజేపీకి ఓటు వేయరు. ఇలాంటి వ్యక్తులను బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందో తెలీదు’’ అని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ఓటమిని అంగీకరించలేక ప్రతిపక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేయడం మాములే. ఒంటిమిట్టలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించిన టీటీడీని జాంబవంతుడి ఆలయాన్ని కూడా నిర్మించాలని అనేకసార్లు కోరాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-03-14T03:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising