ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coromandel Express: తిరుపతి రైల్వేస్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన

ABN, First Publish Date - 2023-06-03T18:43:06+05:30

తిరుపతి రైల్వేస్టేషన్ (Tirupati Railway Station) ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎంపీ చింతామోహన్ (Former MP Chinta Mohan) ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ (Tirupati Railway Station) ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎంపీ చింతామోహన్ (Former MP Chinta Mohan) ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం జరిగిందని తెలిపారు. మాజీ ప్రధాని లాల్బహుదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకుని, తక్షణమే రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం మానుకోవాలని చింతామోహన్ హితవుపలికారు. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒరిస్సాలోని బాలాసోర్‌ దగ్గరలోని బహానగర్‌ బజార్‌ స్టేషన్‌ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్‌లో యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు యశ్వంత్‌పూర్‌ హౌరా రైలుకు తగి లాయి. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ 12 బోగీలు పట్టాయి. రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. రైలు ప్రమాదంలో మరో 900 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి.

Updated Date - 2023-06-03T18:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising