ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IAS Turned Politician : పది రోజుల కిందటే పోస్టింగ్‌.. అప్పుడే వైఎస్ జగన్‌ సేవలో ఐఏఎస్‌..!

ABN, First Publish Date - 2023-07-30T01:51:27+05:30

మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి... కరికాల వలవన్‌ ముఖ్యమంత్రి జగన్‌ సేవలో చేరిపోయినట్లు తెలుస్తోంది...

తిరుపతి ఎంపీ టికెట్‌పై కరికాల కన్ను

అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి... కరికాల వలవన్‌ ముఖ్యమంత్రి జగన్‌ సేవలో చేరిపోయినట్లు తెలుస్తోంది. ఆయన తిరుపతి లోక్‌సభ స్థానంనుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఐఏఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ ప్రస్థానానికి అనువుగా ఉండేలా... టీటీడీ బోర్డులో ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా కొనసాగేలా... దేవదాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పదవి దక్కించుకున్నారని సమాచారం. విశేషమేమిటంటే... కరికాల వలవన్‌కు పది రోజుల కిందటే ఈ పోస్టింగ్‌ వచ్చింది. ఆగస్టు నెలాఖరుతో ఆయన రిటైర్‌ అవుతున్నారు. కానీ... అసాధారణ రీతిలో జగన్‌ సర్కారు ఆయన్ను ఏడాదిపాటు అదే పోస్టులో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే... ఆయన ఎంచక్కా ఎక్స్‌ అఫిషియో మెంబర్‌ హోదాలో టీటీడీలో కొనసాగుతూ, తిరుపతిలో తన రాజకీయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు! కరికాల వలవన్‌ తమిళనాడుకు చెందిన అధికారి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న తిరుపతి లోక్‌సభ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్‌ తరఫున ప్రచారం చేసేందుకు వీలుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ విజయ్‌ కుమార్‌ జనంలోకి వెళ్తున్నారు. ఆయన కూడా వైసీపీ తరఫున బరిలో దిగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మున్ముందు మరెంతమంది ఐఏఎస్‌ అధికారులు తమ రాజకీయ ఆకాంక్షలు బయటపెట్టుకుంటారో చూడాలి!

Updated Date - 2023-07-30T08:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising