Chandrababu Arrest: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్.. పవన్ వెంటే నారా లోకేష్, బాలకృష్ణ
ABN, First Publish Date - 2023-09-14T12:45:55+05:30
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో స్కామ్ జరిగిందంటూ అక్రమ కేసు బనాయించడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో చంద్రబాబుతో ములాఖత్ కోసం జనసేన అధినేత రాజమండ్రి జైలుకి వెళ్లారు.
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో స్కామ్ జరిగిందంటూ అక్రమ కేసు బనాయించడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో చంద్రబాబుతో ములాఖత్ కోసం జనసేన అధినేత రాజమండ్రి జైలుకి వెళ్లారు. ఆయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ముగ్గురూ జైలులోకి వెళ్లారు.
జైలు ప్రధాన గేట్ లోపలి వరకు పవన్ కల్యాణ్ వాహనానికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. జైలు దగ్గరకు జనసైనికులు, టీడీపీ శ్రేణులు రాకుండా ఆంక్షలు విధించారు. కీలకమైన ములాఖత్ నేపథ్యంలో జైలు వద్ద అధికారులు ఆంక్షలు విధించారు.
ఇదిలావుండగా ములాఖత్ తర్వాత పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ మీడియాతో మాట్లాడతారా? ఏం మాట్లాడుతారు?, భవిష్యత్ కార్యచరణను ఏమైనా ప్రకటించబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Updated Date - 2023-09-14T12:50:26+05:30 IST