ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హుండీ దొంగల ముఠా అరెస్ట్‌

ABN, First Publish Date - 2023-08-15T00:01:44+05:30

మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో చోరీలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలి పారు.

హుండీ దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

వీరబల్లి, ఆగస్టు 14: మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో చోరీలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలి పారు. ఆయన వివరాల మేరకు.. ఇటీవల గంగ మ్మ ఆలయంలో, రాగిమానుదిన్నెపల్లె నరసింహస్వామి ఆలయాల్లో హుండీల దొంగతనం జరిగిందని స్థానిక గ్రామస్తులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టి సోమవారం రాగిమానుదిన్నెపల్లె వద్ద 6 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరు తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం చిన్నబయలు పచ్చారవాండ్లపల్లె యానాదికాలనీకి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. వీరంతా ఇటీవల వీరబల్లి, సంబేపల్లె, చిన్నమండెం, రామాపురం, మన్నూరు, ఓబులవారిపల్లె మండలాల్లో హుండీ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు, స్టార్టర్లు కూడా దొంగతనం చేశారని విచారణలో తేలిందన్నారు. వారి వద్ద నుంచి రూ.35 వేలు నగదు, ఆరు గ్రామాల బంగారు, 65 గ్రాములు వెండి, 17 కిలోల రాగి వైరు, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-08-15T00:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising