ఉరుసు మహోత్సవాలకు రూ.50 వేల విరాళం
ABN, First Publish Date - 2023-06-07T01:22:45+05:30
మల్లాయిపాలెంలోని హజరత్ సయ్యద్ సాలార్ షా ఔలియా ఖాదరీ ఉరుసు మహోత్సవాలకు ఎమ్మెల్యే కొడాలి నాని రూ.50 వేలు విరాళం అందజేశారు.
గుడివాడ రూరల్, జూన్ 6 : మల్లాయిపాలెంలోని హజరత్ సయ్యద్ సాలార్ షా ఔలియా ఖాదరీ ఉరుసు మహోత్సవాలకు ఎమ్మెల్యే కొడాలి నాని రూ.50 వేలు విరాళం అందజేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని అందజేసిన నగదు మొత్తాన్ని వైసీపీ మైనార్టీ నేతలు మంగళవారం ఖాదరీ బాబా దర్గా పెద్దలకు అందజేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని అందజేస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొంటూ దర్గా పెద్దలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర దర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో కృషి చేస్తున్నారని వైసీపీ మైనా ర్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సయ్యద్, ఖాదరి బాబా దర్గా పెద్దలు యాకూబ్ బేగ్, అఫ్జల్ బేగ్, అమీన్ బేగ్, మొయిన్ బేగ్, అబ్దుల్ తాజుద్దీన్, మైనార్టీ సెల్ నేతలు సాలెహా రజాక్ బాషా, షాకీర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T01:22:45+05:30 IST