ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayawada: వంగవీటి వారసుడు పెళ్లి ముహూర్తం ఖరారు

ABN, First Publish Date - 2023-10-08T12:56:43+05:30

విజయవాడ: దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వారసుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారు అయింది.

విజయవాడ: దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) వారసుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ (Vangaveeti Radha Krishna) పెళ్లి ( Marriage) ముహూర్తం ఖరారు అయింది. పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణిల కుమార్తె పుష్పవల్లి (Pushpavalli)తో సెప్టెంబర్ 3వ తేదీన నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి వివాహ ముహూర్తం ఖరారైంది. ఈనెల 22వ తేదీన విజయవాడ సమీపంలోని పోరంకిలోని మురళి రిసార్ట్‌లో వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిల వివాహం రాత్రి 7.59 గంటలకు జరగనుంది. కాగా ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వంగవీటి రాధా కృష్ణ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున తొలిసారి 2004లో గెలిచారు. 2009లో కూడా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉంటే గెలిచి ఉండేవారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వారించినా వినకుండా అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు.

Updated Date - 2023-10-08T12:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising