వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి: బొండా ఉమా
ABN, First Publish Date - 2023-11-29T00:16:35+05:30
: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
స్థానికులతో మాట్లాడుతున్న బొండా ఉమా
వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి: బొండా ఉమా
పాయకాపురం, నవంబరు 28 : ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 62వ డివిజన్లో మంగళవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్ర మంలో ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేయనున్న వివిధ పథకాలతో కూడిన కరపత్రాలను స్ధానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పథకాల పేరుతో ప్రజలు మోసం చేయడమే తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. నేతలు పైడి తులసి, పైడి శ్రీను, ఉదయ్శంకర్, ఆరుమళ్ల గోపిరెడ్డి, మంగరాజు, జనసేన నేతలు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-29T00:16:37+05:30 IST