‘టీడీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధం’
ABN, First Publish Date - 2023-11-28T23:55:59+05:30
వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.
ఆళ్లగడ్డ, నవంబరు 28: వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామానికి చెందిన వైసీపీ, బీజేపీలకు చెందిన 70 కుటుంబాలు మంగళవారం అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరాయి. ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారన్నారు. కార్యక్ర మంలో టీడీపీలో చేరిన చిన్నస్వామి, హరి, నడిపెన్న, పెద్దన్న, ఓబులేసు తదితరులు, టీడీపీ నాయకులు విఖ్యాత్రెడ్డి, భార్గవ్ రామ్నాయుడు, శేఖర్రెడ్డి, బాలపుల్లారెడ్డి, నరసింహుడు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-28T23:56:00+05:30 IST