కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పార్టీలకతీతంగా ఇళ్ల స్థలాల మంజూరు

ABN, First Publish Date - 2023-07-03T22:13:59+05:30

పార్టీలకతీతంగా ప్రభుత్వం పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. అల్లూరులోని దయాకర్‌రెడ్డి లేఅవుట్‌లో సోమవారం పలువురికి ఇళ్ల పట్టాలను ఆయన అందచేశారు. ముందుగా

పార్టీలకతీతంగా ఇళ్ల స్థలాల మంజూరు
3అల్లూరు1 : ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, జూలై 3 : పార్టీలకతీతంగా ప్రభుత్వం పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. అల్లూరులోని దయాకర్‌రెడ్డి లేఅవుట్‌లో సోమవారం పలువురికి ఇళ్ల పట్టాలను ఆయన అందచేశారు. ముందుగా వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇళ్లను ఇచ్చిందన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డీ శశిరేఖ, జడ్పీటీసీ వేణమ్మ, నాయకులు దండా కృష్ణారెడ్డి, నీలం సాయికుమార్‌, ఊటు శ్రీకాంత్‌రెడ్డి, దేవరాల సుబ్రహ్మణ్యం, సాధిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-03T22:13:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising