ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

షోకాజ్‌ నోటీసులను ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2023-11-27T00:16:23+05:30

చిన్న చిన్న కారణాలకు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు, చార్జ్‌ మెమోలు ఇస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ నవకోటేశ్వరరావు తెలిపారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు

ఏఎస్‌ పేట, నవంబరు 26: చిన్న చిన్న కారణాలకు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు, చార్జ్‌ మెమోలు ఇస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ నవకోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన ఏఎస్‌ పేటలో నిర్వహించిన యూటీఎఫ్‌ మండల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ అధికారులు పాఠశాలల తనిఖీల్లో సిలబస్‌ పూర్తి కాలేదని, వర్క్‌ బుక్కులు దిద్దలేదనే కారణాలతో షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారని వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు రావసిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని జిల్లా కోశాధికారి మురళీధరరావు తెలిపారు. అనంతరం షేక్‌ జిలానీ పాషాను గౌరవ అధ్యక్షులుగా, కేవీ వరప్రసాద్‌ను అధ్యక్షులుగా, ఈ శ్రీనివాసులును అసోసియేట్‌ అధ్యక్షులుగా, యశోదమ్మను ప్రధాన కార్యదర్శిగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - 2023-11-27T00:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising