కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీలో వైసీపీ నేతల చేరిక

ABN, First Publish Date - 2023-12-12T00:07:36+05:30

సారవకోట మండలం మూగుపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు సోమవారం టీడీపీలో చేరారు.

టీడీపీలో వైసీపీ నేతల చేరిక
పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు

నరసన్నపేట: సారవకోట మండలం మూగుపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు సోమవారం టీడీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ బీసీ కమిటీ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌ నేతృత్వంలో పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. మాజీ సర్పంచ్‌ యజ్జల లచ్చయ్య, గ్రామ నాయకుడు బుడితి దామోదర్‌ ఆధ్వర్యంలో ఆరు కుటుంబాలకు చెందిన పెద్దింటి ఆదినారాయణ, బోచ్చ చిరంజీవి, బుద్దల ఢిల్లేశ్వరరావు, మాధవరావు, కృష్ణ, లుకలాపు శేఖర్‌, దొర తదితరులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, క్లస్టర్‌ ఇన్‌చార్జి సురవరపు తిరుపతిరావు, నాయకులు సాధు చిన్నికృష్ణంనాయుడు, ఇ.నాగరాజు, ముఖలింగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-12T00:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising