21న కళింగపట్నం బీచ్‌ క్లీనింగ్‌

ABN, First Publish Date - 2023-05-16T23:28:33+05:30

పర్యావరణ పరిరక్షణకు ప్రజలు పునరంకితం కావాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళంలో మిషన్‌ లైఫ్‌(లైఫ్‌ స్టయిల్‌ ఫర్‌ ఎన్విరాన్మెంట్‌) కార్యక్రమం నిర్వహించారు.

21న కళింగపట్నం బీచ్‌ క్లీనింగ్‌
సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

శ్రీకాకుళం, మే 16(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రజలు పునరంకితం కావాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళంలో మిషన్‌ లైఫ్‌(లైఫ్‌ స్టయిల్‌ ఫర్‌ ఎన్విరాన్మెంట్‌) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు అధికారులు, పర్యావరణ ప్రేమికులు డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ నుంచి ఏడురోడ్ల జంక్షన్‌ వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై జూన్‌ 5 వరకు పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అందరూ మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రకృతితో మమేకమయ్యేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ నెల 21న కళింగపట్నం బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణకు తోడ్పాటు నిద్దామని అధికారులు, పర్యావరణ ప్రేమికులతో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకర్‌నాయక్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఓబులేసు, జిల్లా చీఫ్‌కోచ్‌ మాధురీలత, సెట్‌శ్రీ సీఈవో ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-16T23:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising