వివేకా హత్య కేసు విచారణతో తాడేపల్లి ప్యాలెస్లో వణుకు
ABN, First Publish Date - 2023-02-13T23:48:13+05:30
వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణతో తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కలమట వెంకట రమణమూర్తి అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ‘జగనాసుర రక్తచరిత్ర’ పోస్టర్ను ఆవిష్కరించారు.
మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి
పాతపట్నం: వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణతో తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కలమట వెంకట రమణమూర్తి అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ‘జగనాసుర రక్తచరిత్ర’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికలకు ముందు బాబాయి హత్యను నాటి ప్రతిపక్ష నేత జగన్.. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై నెట్టి నారాసుర రక్తచరిత్ర అని ప్రచారం చేసి సానుభూతి ఓట్ల కోసం వాడు కు న్నారని విమర్శించారు. ఇప్పుడిప్పుడే ఆ అపోహలు వీడి జగనాసుర రక్త చరిత్ర అని ప్రజలకు తెలుస్తోందన్నారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరైనా, ఎంత పెద్దవారైనా శిక్షపడాల్సిందే నన్నారు. ఎన్నికల ముం దు కోడి కత్తితో దాడిచేయించుకొని ఇప్పటికి నాలుగేళ్లవుతున్నా ఇంకా దాడికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ రాకుండా చేయిస్తున్నది జగన్మోహన్ రెడ్డే అని విమర్శించారు. సమావేశంలో పైల లక్ష్మయ్య, పైల బాబ్జీ, మడ్డు రామా రావు, కర్రి అప్పారావు, సైలాడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-13T23:48:14+05:30 IST