హెటెరో పరిశ్రమలో ఉద్యోగి ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-08-22T00:40:17+05:30
మండలంలోని హెటెరో ఔషధ పరిశ్రమలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి సోమవారం తెల్లవారుజామున కంపెనీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
నక్కపల్లి, ఆగస్టు 21: మండలంలోని హెటెరో ఔషధ పరిశ్రమలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి సోమవారం తెల్లవారుజామున కంపెనీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
నర్సీపట్నంలోని శివపురం ప్రాంతానికి చెందిన బట్టా రామ గోవింద చంద్రశేఖర్ (42) నక్కపల్లి మండలంలోని హెటెరో ఔషధ పరిశ్రమ ఎన్ఆర్ బ్లాక్లో షిఫ్ట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యాడు. రాత్రంతా తోటి ఉద్యోగితో కలిసి పనిచేశాడు. చంద్రశేఖర్ సోమవారం తెల్లవారుజామున కనిపించకపోవడంతో సహచర ఉద్యోగులు వాకబు చేశారు. చుట్టుపక్కల కనిపించకపోవడంతో సమీపంలో వున్న స్ర్కాప్ షెడ్లో పరిశీలించారు. చంద్రశేఖర్ అక్కడ ఉరేసుకుని కనిపించాడు. కొనఊపిరితో వుండడంతో వెంటనే నక్కపల్లి సీహెచ్సీకి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. అప్పటికే చనిపోయాడని చెప్పారు. సమాచారం అందుకున్న చంద్రశేఖర్ భార్య శేషవరలక్ష్మి వచ్చి, నిర్జీవంగా మారిన భర్తను చూసి భోరున విలపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ శిరీష చెప్పారు.
Updated Date - 2023-08-22T00:40:31+05:30 IST