ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం

ABN, First Publish Date - 2023-04-19T01:03:41+05:30

రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టగానే నిత్యావసర ధరలు అదుపులోకి తీసుకువస్తామని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు.

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుమ్మపాల, ఏప్రిల్‌ 18: రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టగానే నిత్యావసర ధరలు అదుపులోకి తీసుకువస్తామని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాపయ్యపాలెంలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రితోపాటు వైసీపీ నాయకులే బాగు పడ్డారన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. రాష్ట్రంలో పేదరికం రోజు రోజుకి పెరిగిపోతుంటే జగన్మోహన్‌రెడ్డి మాత్రం ధనిక సీఎంగా వర్ధిల్లుతున్నారన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి లేదన్నారు. వైసీపీ నాయకులు దోచుకోవడం.. దాచుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారని, ప్రజా సమస్యలను పక్కన పెట్టేశారన్నారు. అనంతరం కరపత్రాలను పంచుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు గంగిరెడ్ల గోవింద, శెట్టి వెంకటరమణ, తలారి కాశీనాయుడు, మదుపాడ నరసింగరావు, దాడి నాగేశ్వరరావు, కరణం రమణ, బత్తుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-19T01:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising